న్యూఢిల్లీ, మే 7: వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్ను పూర్తిగా మహిళా సైనికులతోనే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. సంబంధిత ఏర్పాట్లు చేయాల్సిందిగా త్రివిధ దళాలకు, ప్రభుత్వ శాఖలను ఆదేశించినట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. పరేడ్లో బ్యాండ్లు, మార్చ్, శకటాలు, ప్రదర్శనలు మహిళలే నిర్వహించనున్నట్టు చెప్పారు. ఏటా గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలోని కర్తవ్యపథ్లో పరేడ్ ఘనంగా జరుగుతుంది.