న్యూఢిల్లీ: సహజవాయు ఇంధన ధరలను నిర్ణయించటంలో కేంద్రం కొత్త విధానానికి ఆమోదముద్ర వేసింది. సహజవాయు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేస్తున్న ఇంధనం ధరల్ని ఇక నుంచి ముడిచమురు ధరలతో అనుసంధానం చేసింది.
ఇప్పటివరకూ అమెరికా తదితర దేశాల్లో గ్యాస్ ట్రేడింగ్ హబ్ల్లోని ధరలకు అనుగుణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి సహజవాయు ధరల్ని మార్చేవారు. ఈ విధానాన్ని రద్దు చేస్తూ దిగుమతి చేసుకున్న ముడి చమురు ధరలతో సహజవాయు ధరల్ని కేంద్రం అనుసంధానం చేసింది. దీంతో ప్రతినెలా ధరల్లో మార్పులు ఉండబోతున్నాయి.