గాంధీనగర్: ఐడీబీఐ సహా ఐదు బ్యాం కుల నుంచి రూ.వందల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన గుజరాత్కు చెందిన జైహింద్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (జేపీఎల్)పై సీబీఐ కేసు నమోదు చేసింది. అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న జేపీఎల్ గ్యాస్, ఆయి ల్, కెమికల్ పైపులైన్ల ప్రాజెక్టుల నిర్మా ణం కోసం ఐడీబీఐతో పాటు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాం కుల కన్సార్టియం నుంచి రూ.627 కోట్లు రుణం తీసుకొన్నది.
బకాయిలు చెల్లించకపోవడంతో బ్యాంకులు దీనిపై ఆరా తీశాయి. జేపీఎల్ తాను పేర్కొన్న ప్రాజెక్టులను చేపట్టకుండా నిధులు దారి మళ్లించినట్టు ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడి కావడంతో గత ఏడాది మార్చి 17న ఐడీబీఐ జనరల్ మేనేజర్ రాహుల్ సిన్హా సీబీఐకి ఫిర్యాదు చేశారు.