న్యూఢిల్లీ: రెండో విడత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో డ్రీమ్ గర్ల్ హేమామాలిని మూడవ అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. మథుర నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హేమామాలిని ఆస్తుల విలువ రూ.278 కోట్లు.
కాగా, కర్ణాటకలోని మండ్య కాంగ్రెస్ అభ్యర్థి వెంకట రమణి గౌడ 622 కోట్లు, బెంగళూరు రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేష్ 593 కోట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.