స్పెయిన్కు చెందిన ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ తయారు చేసిన సీ-295 మీడియం టాక్టికల్ ట్రాన్స్పోర్ట్ విమానం సోమవారం భారత వాయు సేనలోకి ప్రవేశించింది. ఇటువంటి 56 విమానాల కోసం భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో మొదటి విమానం ఇటీవల భారత్కు చేరుకుంది.
దీనిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో హిండన్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో ఐఏఎఫ్లోకి ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, ఎయిర్బస్ అధికారులు పాల్గొన్నారు.