కోల్కతా, ఆగస్టు 27: ఆధ్యాత్మికానికి పేరుగాంచిన భారతదేశంలో మరో అధునాతన ఆలయం అందుబాటులోకి రానున్నది. పశ్చిమబెంగాల్లోని మాయాపూర్లో నిర్మిస్తున్న ‘వేదిక్ ప్లానిటోరియం’ ఆలయాన్ని వీలైనంత త్వరగా భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఆలయం అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలోనే మతపరమైన అతిపెద్ద ఆలయంగా చరిత్రలో నిలిపోనున్నది. ఇప్పటి వరకు ఈ రికార్డు కాంబోడియాలోని అంగ్కోర్ వాట్ ఆలయం పేరిట ఉన్నది. ఇస్కాన్ ప్రధాన కార్యాలయం కూడా వేదిక్ ప్లానిటోరియంలోనే ఉండనున్నది. వాస్తవానికి ఈ ఆలయాన్ని 2022లోనే భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.
వేదిక్ ప్లానిటోరియం ప్రత్యేకతలు
తాజ్మహల్, వాటికన్లోని సెయింట్ పాల్ కేథడ్రల్ కన్నా వేదిక్ ప్లానిటోరియం పెద్దది.
ఈ ప్లానిటోరియం నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న డూమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. బహుశా ప్రపంచంలో ఇలాంటి డూమ్ను ఎక్కడ నిర్మించకపోవచ్చని నిర్వాహకులు చెప్తున్నారు.
దాదాపు రూ.800 కోట్లను ఖర్చు చేసి ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
ప్రతి ఫ్లోరులో 10,000 మంది భక్తులు ఉండేలా నిర్మిస్తున్నారు.