న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: స్వలింగ వివాహాలకు వ్యతిరేకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) తీర్మానం చేసింది. అన్ని రాష్ర్టాలకు చెందిన బార్ కౌన్సిల్ సభ్యులు ఆదివారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడానికి వ్యతిరేకంగా ఈ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టినట్టు బీసీఐ చైర్మన్ మానన్ కుమార్ మిశ్రా తెలిపారు.
స్వలింగ వివాహాల వల్ల భారత సంస్కృతి, సంప్రదాయాలకు విఘాతం కలుగుతుందని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చే ముందు దేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. స్వలింగ వివాహాల చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్లను సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో బీసీఐ ఈ తీర్మానం చేసింది.