Ayodhya Ram Mandir | అయోధ్య: అయోధ్య ఆలయాన్ని ఇసుక నేల ప్రాంతంలో 12-14 మీటర్ల లోతు వరకు ఇసుక తొలగించి ప్రత్యేకంగా తయారుచేసిన కాంపాక్టెడ్ కాంక్రీట్తో చేసిన పునాదిపై నిర్మించారు. 2500 ఏండ్ల పాటు భూకంపాలు తట్టుకొనేలా ఉండేందుకు, ఇటుకల మధ్య ఉండే డ్రై జాయింట్ నిర్మాణాలు వెయ్యేండ్లు మన్నేలా ఉండేందుకు కేవలం పరస్పరం అనుసంధానమైన రాళ్లతోనే నాగర శైలిలో ఆలయాన్ని డిజైన్ చేశారు. నిర్మాణాల పటిష్ఠత కోసం సంప్రదాయబద్ధమైన ఇలాంటి నిర్మాణ శైలిలో ఇనుము, ఉక్కు వంటి వాడకుండా కేవలం రాళ్లతోనే నిర్మాణాలు చేపడతారు. అయోధ్య ఆలయాన్ని కూడా అందుకే ఇనుము, ఉక్కు వాడకుండా నిర్మించారు.