లక్నో: ఉత్తర ప్రదేశ్లోని వారణాసి జిల్లా కోర్టు తీర్పు మేరకు జ్ఞానవాపి మసీదు దక్షిణ సెల్లార్లో హిందూ దేవతలకు జరుగుతున్న పూజలను నిలిపేసేందుకు అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. తదుపరి విచారణ ఈ నెల 6న జరుగుతుంది. జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించి, హైకోర్టుకు వెళ్లాలని సలహా ఇచ్చింది. ఈ కమిటీ తరపు న్యాయవాది ఎస్ఎఫ్ఏ నక్వీ వాదనలు వినిపిస్తూ, జిల్లా కోర్టు చాలా ఆత్రుతగా ఈ తీర్పు చెప్పిందని, న్యాయమూర్తి పదవీ విరమణ రోజునే తీర్పు చెప్పారని తెలిపారు.
తాము సమర్పించిన పత్రాలను ఈ తీర్పు చెప్పడానికి ముందు న్యాయమూర్తి పరిశీలించలేదని చెప్పారు. దీనిపై హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్ జైన్ స్పందిస్తూ, జిల్లా కోర్టు జనవరి 17న ప్రాపర్టీ రిసీవర్గా వారణాసి జిల్లా కలెక్టర్ను నియమించిందని, అందుకు అనుగుణంగానే ఆయన జనవరి 24న ఆస్తిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. జనవరి 31న వెలువడిన ఆర్డర్ కేవలం అనుబంధ ఆదేశాలేనని చెప్పారు.జ్ఞానవాపిలో పూజలకు అనుమతించడాన్ని నిరసిస్తూ మసీదు కమిటీ పిలుపు మేరకు వారణాసిలో శుక్రవారం బంద్ జరిగింది.
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ కాంప్లెక్స్లో ‘జ్ఞానవాపి మసీదును కాపాడండి’ అని ప్లకార్డులను ప్రదర్శించారు.