న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్ శాఖలో రూ.350 కోట్ల కుంభకోణంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) శుక్రవారం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. లెఫ్ట్నెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా ఈ కుంభకోణానికి బాధ్యత వహించాలని కోరింది.
‘ప్రధాని గారు.. ఢిల్లీ పోలీసులు మీ కిందే పని చేస్తారు. ఈ కుంభకోణం విచారణకు నోచుకుంటుందా? దోషులు జైలుకెళ్తారా?’ అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ స్కామ్పై మీడియా నివేదికను జత చేశారు. ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ ఢిల్లీలో స్కామ్ జరిగితే సీబీఐ, ఈడీ ఎక్కడుందని నిలదీశారు.