న్యూఢిల్లీ, డిసెంబర్ 7: జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 11న సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనున్నది.
16 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేసింది. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది.