Terror Attack | శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు చైనా తయారు చేసిన ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను, బాడీసూట్ కెమెరాలను ఉపయోగించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పాక్ సైన్యానికి డ్రోన్లు, హ్యాండ్ గ్రనేడ్లు, ఇతర ఆయుధాలను చైనా సరఫరా చేస్తోందని తెలిపాయి. వాటికి సంబంధించిన ఆధారాలు భారత భద్రతా బలగాలకు దొరికాయని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
పాకిస్థాన్ నుంచి భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులు చైనా టెక్నాలజీతో తయారు చేసిన స్నిపర్ గన్ఃలను భారత సైనికులపై వినియోగిస్తున్నట్లు తేలింది. నవంబర్లో జమ్మూ సరిహద్దులో భారత సైనికుడిపై స్నిపర్ తుపాకీతో కాల్పులు జరిపినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
అయితే, గత రెండేళ్లుగా చైనా ఆక్రమణలను భారత సైన్యం అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జమ్మూ, లడఖ్ సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనాలకు భారత్ తగిన సమాధానం ఇస్తోంది. జమ్మూకశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఫూంచ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కులపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేయడంతో ఈ ఘటన జరిగింది.