శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఆర్మీ ఔట్పోస్టుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బారాముల్లా జిల్లా చర్దారీలో ఉన్న Army Doctrine Publications (ఏడీపీ)పై ఉగ్రవాదులు కాల్పలకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. దీంతో ఓ ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
మృతిచెందిన వ్యక్తిని జావేద్ అహ్ వానీగా గుర్తించామని, అతడు కుల్గాం జిల్లాకు చెందినవాడన్నారు. బీహార్ వలస కార్మికులను చంపినవారిలో ఇతడు కూడా ఉన్నాడని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. అతడు ఓ వ్యాపరస్థుడిని చంపాలనుకున్నాడని చెప్పారు. ఘటనా స్థలంలో ఒక పిస్తోలో, మ్యాగజైన్, పాకిస్థాన్కు చెందిన హ్యాండ్ గ్రనైడ్ను స్వాధీనం చేసుకున్నామన్నారు.