శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. షోపియాన్లోని తుక్వాన్గామ్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో కార్డన్ సెర్చ్నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలపై ముష్కరులు కాల్పులు జరిపారని, ప్రతిగా జరిపిన కాల్పుల్లో ముష్కరుడు హతమయ్యాడని పోలీసులు తెలిపారు. అతడు ఏగ్రూప్నకు చెందినవాడనే విషయం గుర్తించాల్సి ఉందన్నారు. ఆ ప్రాంతంలో గాలింపు ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు.