జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లా వాహిబగ్లో శుక్రవారం పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో శ్రీనగర్కు చెందని ఉగ్రవాది బషీర్ షేక్ హతమయ్యాడు. ఈ నెల 2న పౌరుడిని కాల్చి చంపిన కేసులో బషీర్ షేక్ నిందితుడిగా ఉన్నాడు. ఘటనాస్థలిలో ఏకే-47 రైఫిల్, మ్యాగజైన్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు.