శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామాలో ఉగ్రవాదులు ఆదివారం పోలీస్ సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ పోలీస్ తీవ్రంగా గాయపడ్డగా.. చుట్టుపక్కల ఉన్న వారు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఉగ్రదాడి గురించి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. గాయపడ్డ పోలీస్ను ముస్తాక్ అహ్మద్గా గుర్తించారు.
ఇదిలా ఉండగా.. ఈ నెల 13న శ్రీనగర్లో పోలీస్ బస్సుపై దాడి చేయగా.. 12 మంది గాయపడగా.. ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఏఎస్ఐ గులాం హసన్, కానిస్టేబుల్ షఫీక్ అలీ, రమీజ్ అహ్మద్ విరమణ పొందగా.. బస్ డ్రైవర్తో సహా 11 మంది సైనికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు తాము బాధ్యులమని కశ్మీర్ టైగర్స్ ప్రకటించింది. 13న రోజు పార్లమెంట్పై దాడి జరిగి 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2021, డిసెంబర్ 13న పార్లమెంట్పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇందులో తొమ్మిది మంది మరణించగా.. దాడికి పాల్పడిన ఐదుగురు ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు అదే రోజు ఉగ్రవాదులు పోలీస్ బస్పై దాడికి తెగబడ్డారు.