శ్రీనగర్: అమర్నాథ్ యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్టు భద్రతా వర్గాలకు సమాచారం అందింది. ముఖ్యంగా యాత్రికులు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడికి పాల్పడే అవకాశముందని తెలిసింది. దీంతో అప్రమత్తమైన బలగాలు భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి.