ఇంఫాల్: మణిపూర్ రాజధాని ఇంఫాల్, దాని పరిసర ప్రాంతాల్లో సోమవారం మళ్లీ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. మైబమ్ అవినాష్ (16), నింగ్తౌజమ్ ఆంథోనీ (19) అనే ఇద్దరు టీనేజర్లు ఆదివారం అదృశ్యమవడంతో మూడు ప్రముఖ ఉన్నత పాఠశాలల విద్యార్థులు సోమవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బాధితులిద్దరూ సెక్మల్ వైపు బైక్పై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వారిని అపహరించారని స్థానికులు చెప్పారు. సేనాపతి జిల్లాలోని ఓ పెట్రోలు బంకు వద్ద వీరిద్దరి ఫోన్లు ఓ కవరులో పెట్టి ఉండగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.