Telangana | న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి నివాళులు, తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. తర్వాత కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు.
ఢిల్లీ కమిటీ అధ్యక్షులు వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్కర్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కలం వీరుల చరిత్ర తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం మాత్రేమ అని పేర్కొన్నారు. తెలంగాణ మలిదశ పోరాటం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ ఉద్యమం వైపు వారి పోరాటాలను చిత్రీకరిస్తూ జర్నలిస్టుల ఫోరం ముందుకు నడిపించిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తిరుపతి, కోశాధికారి శిరీష్, కార్యదర్శి గోపి, రాజశేఖర్ రెడ్డి, కె.రాజు, రవీందర్ రెడ్డి, కామరాజు, అరుణ్, రవీందర్ రెడ్డి, రవి, జబ్బర్ నాయక్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.