BJP | న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మూడో జాబితా విడుదల చేసింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన 9 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను గురువారం సాయంత్రం ఆ పార్టీ అధికారికంగా విడుదల చేసింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చెన్నై సౌత్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్లు జాబితాలో పేర్కొన్నారు. కోయంబత్తూరు నుంచి అన్నామలై, కన్యాకుమారి నుంచి రాధాకృష్ణన్, చెన్నై సెంట్రల్ నుంచి వినోజ్ పీ సెల్వం, వెల్లూరు నుంచి డాక్టర్ ఏసీ షణ్ముఘం, కృష్ణగిరి నుంచి సీ నరసింహా, నీలగిరి – డాక్టర్ ఎల్ మురుగన్, పెరంబలూరు నుంచి టీఆర్ పర్వేంధర్, తూత్తూకుడి నుంచి నైనార్ నరేంద్రన్ పోటీ చేయనున్నారు.