Tejashwi Yadav : కాషాయ పార్టీ లక్ష్యంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శలతో విరుచుకుపడ్డారు. బిహార్లో విద్వేషం వ్యాప్తి చేసేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తారని, అసత్యాలతో విషం వెదజల్లుతారని అన్నారు. తేజస్వి యాదవ్ పట్నాలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. అమిత్ షా అసత్యాలను బిహార్ ప్రజలు విశ్వసించరని స్పష్టం చేశారు.
అసత్యాలు, విద్వేష వైఖరిని బిహార్ ఎన్నటికీ అనుసరించదని చెప్పారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన దిశగా బిహార్ అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు. గత పదేండ్లుగా నరేంద్ర మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వం బిహార్ అభివృద్ధి కోసం ఏ చేసిందని ఆయన నిలదీశారు.
కాగా, ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ కేవలం ఫొటోలకు ఫోజులు ఇవ్వడం, జెండాలు ఊపడం వరకే పరిమితమయ్యారని అంతకుముందు ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. బీజేపీకి ఈ ఎన్నికల్లో పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ నయ వంచనతో బిహార్ను నట్టేట ముంచారని పాటలీపుత్ర లోక్సభ నియోజకవర్గ ఆర్జేడీ అభ్యర్ధి మిసా భారతి ఆరోపించారు.
Read More :
GHMC | గ్రేటర్లో 2 రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ