పాట్నా: బీహార్లో ఓటర్ల జాబితా సవరణ వివాదం కొత్త మలుపు తిరిగింది. బీజేపీ నేత, డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హాకు రెండు ఓటరు కార్డులున్నాయని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలను మీడియా ముందు బయటపెట్టారు. ఉప ముఖ్యమంత్రి సిన్హాకు వేర్వేరు అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు ఎపిక్ నంబర్లు ఉన్నాయని ఆరోపించారు. ఈ రెండు ఓటరు కార్డుల్లో ఆయన వయస్సు కూడా భిన్నంగా ఉన్నదని విమర్శించారు. బంకిపూర్ సెగ్మెంట్లో ఉన్న ఓటరు కార్డులో 60 ఏళ్ల వయస్సు, లఖిసరాయ్లోని ఓటరు కార్డులో 57 ఏళ్ల వయస్సు ఉన్నదని తెలిపారు. ‘ఈ రెండు ఎపిక్ నంబర్ల జారీకి సంబంధించిన పత్రాలపై ఆయన సంతకం చేసి ఉండాలి లేదా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ మొత్తం మోసపూరితమైనది’ అని ఆరోపించారు. ఈ మోసానికి పాల్పడిన సిన్హాపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, తేజస్వి యాదవ్ ఆరోపణలను డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఖండించారు. తన కుటుంబం గతంలో బంకిపూర్ అసెంబ్లీ ప్రాంతంలో నివసించిందని తెలిపారు. దీంతో అక్కడి ఓటరు జాబితా నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ ఫారమ్ నింపినట్లు చెప్పారు. లఖిసరాయ్ ఓటరు జాబితాలో తన పేరును చేర్చినట్లు వివరించారు. ‘జంగిల్ రాజ్ యువరాజు మోసం చేస్తాడు. మేం అలాంటి చర్యలకు పాల్పడం. దురదృష్టవశాత్తు రాజ్యాంగ పదవిలో ఉన్న ఒకరు సరైన జ్ఞానం లేకుండా రాజకీయాలను దుర్వినియోగం చేస్తున్నారు’ అని తేజస్వి యాదవ్పై ఆయన మండిపడ్డారు.
है मोदी जी के खासमखास बिहार के उपमुख्यमंत्री श्री विजय सिन्हा
👉 ये दो अलग-अलग जिलों की दो अलग-अलग विधानसभा क्षेत्रों के दो अलग-अलग जगह के मतदाता हैं। लखीसराय जिले के लखीसराय विधानसभा क्षेत्र से और पटना जिले की बांकीपुर, विधानसभा निर्वाचन क्षेत्र से।
👉 इनके पास दो दो अलग-अलग… pic.twitter.com/E38JXb9nzO
— Tejashwi Yadav (@yadavtejashwi) August 10, 2025
#WATCH | Patna, Bihar: On RJD leader Tejashwi Yadav’s allegations against him, Bihar’s Deputy Chief Minister Vijay Kumar Sinha says, “Earlier, my entire family’s name was listed in Patna. In April 2024, I applied to add my name to the Lakhisarai Assembly. I also filled out a form… https://t.co/RTXpks8GG5 pic.twitter.com/CENx9Q56fF
— ANI (@ANI) August 10, 2025
Also Read: