శాంటియాగో : చావు అనేది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. చావును తప్పించుకోవడం ఇంకా ఎవరి వల్లా కావడంలేదు. 150 ఏండ్లు బతికుండాలంటూ వేల కోట్లు ఖర్చు చేసిన ప్రముఖ సింగర్ మైఖెల్ జాక్సన్.. 50 ఏండ్ల వయసులోనే గుండెపోటుతో చనిపోయారు. లాకర్లో లక్షల కోట్లు మూలుగుతున్నా.. చుట్టూ వందలాది మంది వైద్యులు, సిబ్బంది ఉన్నా.. ఆయన మరణాన్ని మాత్రం జయించలేకపోయారు. ఇవేవీ తెలియని ఓ మహిళ తాను చనిపోతే ఎవరెవరు వస్తారో చూడాలనుకున్నదంట.. అందుకు తానే స్వయంగా దగ్గరుండి మరీ డెత్ రిహార్సల్ చేశారంట. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం.
చిలీ రాజధాని శాంటియాగోకు చెందిన మైరా అలోంజో అనే 59 ఏండ్ల మహిళ తాను చనిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నదంట. అందుకని డెత్ రిహార్సల్ చేయాలని నిర్ణయానికి వచ్చింది. అదే తడవుగా అద్దెకు లభించే లగ్జరీ శవపేటికను తెప్పించింది. ఫొటోగ్రాఫర్లను కూడా నియమించుకున్నది. తెల్లటి దుస్తులు ధరించిన మైరా.. తలపై పువ్వుల కిరీటం, ముక్కులో దూదిని పెట్టుకుని.. సంతాప సభ జరుగుతున్నట్లుగా ఏర్పాట్లు కూడా చేపించింది. అలా ఆమె దాదాపు మూడు గంటలపాటు శవపేటికలో పడుకుని చనిపోయినట్లు నటిస్తూనే ఉందంట.
తన అంత్యక్రియలకు ఎవరు వస్తారో చూడాలని ఆమె కోరిక. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ డ్రామాలో ఆమె కుటుంబం, స్నేహితులు కూడా పూర్తి మద్దతుగా నిలువడం. దీని కోసం కుటుంబం, స్నేహితులను ఎంతగానో ఒప్పించాల్సి వచ్చందంట. అంత్యక్రియల నాటకం మొదలుకాగానే కుటుంబ సభ్యులు నకిలీ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికంతటికి ఆ మహిళ దాదాపు 1000 పౌండ్ల (రూ.1.03 లక్షలు) ఖర్చు చేసినట్లు తేలింది. ఇలా ఉండగా, మైరా తీరును కొందరు ప్రశంసిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. కరోనాతో చనిపోయినవారిని ఇలా ఎగతాళి చేయడం మంచిది కాదని స్థానికులు అంటున్నారు.
టీకా తీసుకోండి.. రూ.7.35 కోట్ల జాక్పాట్ గెలుచుకోండి
స్వతంత్ర్య దేశంగా ఇజ్రాయెల్.. చరిత్రలో ఈరోజు
వ్యాక్సిన్ ఉత్పత్తికి భారత్ బయోటెక్తో చేతులు కలిపిన పీఎస్యూలు
విపత్తులో దోపిడీ అవకాశాన్ని వెతుక్కుంటున్న చైనా
దంతాలు బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే శుభ్రపరుచుకోవాలా..?
సంపాదనలో స్టార్ ఆటగాళ్లను వెనక్కినెట్టిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ స్టార్
1100 ఏండ్ల నాటి పద్యం.. 18 వేల కోట్లు ముంచింది..!
సిద్ధమైన 2-డీజీ ఔషధం.. మొదట ఇచ్చేది ఎక్కడో తెలుసా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..