పాట్నా: బీహార్లో బంకీపూర్ ఉప ఎన్నిక హాట్ టాపిక్గా మారింది. తేజ్ ప్రతాప్ యాదవ్ నేతృత్వంలోని ‘జన్ శక్తి జనతా దళ్’ కూడా బరిలో దిగింది. సామాజిక కార్యకర్త వీణా మాన్వీని తమ అభ్యర్థిగా ప్రకటించింది. (Tej Pratap) తేజ్ ప్రతాప్ యాదవ్ తన పార్టీ ఫారమ్ను ఆమెకు అధికారికంగా అందజేశారు. అనంతరం వీణా మాన్వీ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు. బంకీపూర్ ప్రజల గొంతుకగా నిలుస్తానని, పార్టీ అంచనాలకు అనుగుణంగా పనిచేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
కాగా, బీజేపీ కంచుకోట అయిన బంకీపూర్ ఉప ఎన్నికల బరిలోకి వీణా మాన్వీ దిగడం పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ‘జన్ సురాజ్’ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే ఈ స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. తొలి ఎన్నికల పోరులో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశం ఉన్నది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బంకీపూర్ ఉప ఎన్నిక కీలక పోరుగా నిలువనున్నది.