నాగ్పూర్, అక్టోబర్ 2: తల్లిదండ్రులు తనకు ఐఫోన్ను కొనివ్వడంలో జాప్యం చేస్తున్నారన్న కారణంతో ఓ యువతి (18) ఏకంగా ప్రాణాలనే తీసేసుకొన్నది. మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హింగ్నా పట్టణంలోని రాయ్సోనీ కాలేజీలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న ఆ యువతి.. నాగ్పూర్ ఖర్బీ ప్రాంతంలోని తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొన్నది. ఐఫోన్ను కొనివ్వాలన్న కోర్కెను తీర్చేందుకు తల్లిదండ్రులు (కుటీర పరిశ్రమను నడుపుతూ జీవనం సాగిస్తున్నారు) అంగీకరించినా, కొనుగోలులో జాప్యం చేస్తున్నారని భావించి ఈ నిర్ణయం తీసుకొన్నట్టు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.