భోపాల్ : ఓ ఇద్దరు ప్రేమికులు మైనర్లు.. కానీ పెళ్లైన జంటలా నటించి ఓ హోటల్లో దిగారు. ఆ తర్వాత జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక.. హోటల్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
ఉజ్జయినికి చెందిన ఓ అబ్బాయి.. తన స్నేహితురాలిని ప్రేమిస్తున్నాడు. కానీ ఆమె మరొకరిని ప్రేమిస్తున్నట్లు ప్రియుడు అనుమానించాడు. ఈ క్రమంలో సోమవారం ఇద్దరు మైనర్లు కలిసి ఫేక్ ఐడీ కార్డులు సృష్టించారు. పెళ్లి చేసుకున్నట్లు నటించి, ఆ ఫేక్ ఐడీ కార్డులతో మహాకాళేశ్వర్ టెంపుల్ సమీపంలోని హోటల్లో ఓ రూమ్ తీసుకున్నారు. అదే రోజు సాయంత్రం ఆమె ప్రేమిస్తున్న యువకుడిని అతను హోటల్కు పిలిపించాడు.
ఈ క్రమంలో వీరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక హోటల్ గది కిటికీలో నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మైనర్లకు రూమ్ ఇవ్వడాన్ని తప్పుబట్టిన పోలీసులు.. ఆ హోటల్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశారు.