న్యూఢిల్లీ: సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఇద్దరు స్నేహితులు ఒక యువతిని బలవంతంగా ఒక చోటకు తీసుకెళ్లారు. డ్రగ్స్ కలిపిన ఆహారం తినిపించారు. మత్తులో ఉన్న ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. (Teen Drugged and Raped) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. అంబేద్కర్ నగర్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతికి ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు ఆమెకు ఫోన్ చేసి మదంగిర్లోని సిగ్నల్ కూడలికి రప్పించారు. బెదిరించి స్కూటర్పై ఎక్కించుకుని మాళవియా నగర్కు తీసుకెళ్లారు. ఆ యువతికి డ్రగ్స్ కలిపిన ఆహారం ఇచ్చారు. మత్తులో ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, తెలివిలోకి వచ్చిన తర్వాత తనపై లైంగిక దాడి జరిగినట్లు ఆ యువతి గ్రహించింది. 19, 21 ఏళ్ల వయస్సున్న ఫేస్బుక్ ఫ్రెండ్స్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద బుధవారం కేసు నమోదు చేశారు. నిందితులైన ఇద్దరు యువకులను ఉత్తరప్రదేశ్లోని మీరట్లో గురువారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.