ఇంఫాల్: మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం నివాసం వద్దకు ర్యాలీ గా వెళ్లేందుకు నిరసకారులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులతో ఘర్షణ జరుగడంతో బాష్పవాయు ప్రయోగించారు. ఏప్రిల్ 7న బిష్ణుపూర్ జిల్లాలో ఒక వ్యక్తి ఇంటిపై మోర్టార్ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ దాడిలో ఇద్దరు చిన్న పిల్లలు మరణించగా, వారి తల్లి తీవ్రంగా గాయపడింది. దీంతో మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి.
కాగా, శనివారం ఇంఫాల్లో మణిపూర్ సమగ్రతా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆరు కీలక డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించడానికి సీఎం యుమ్నం ఖేమ్చంద్ సింగ్ నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నిరసనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో నిరసనకారులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు బాష్పవాయువును ప్రయోగించారు. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు.
#Manipur: A rally organised by the Coordinating Committee on Manipur Integrity (COCOMI) in Imphal on April 25 turned tense after clashes broke out between protesters and security forces, prompting the use of tear gas at multiple locations.
Large groups gathered across valley… pic.twitter.com/4AtOhBhjU4
— India Today NE (@IndiaTodayNE) April 25, 2026