లక్నో: చెరువులో నీళ్లు తాగుతావా? అని ఆగ్రహిస్తూ ఓ ఉపాధ్యాయుడు దళిత విద్యార్థి(9)ని చితకబాదాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ జౌలౌన్ జిల్లాలో చోటుచేసుకున్నది. విద్యార్థికి కడుపునొప్పిగా అనిపిస్తే పక్కనే ఉన్న చెరువులోని నీళ్లు తాగాడు.
దళితుడివైన నీవు అందరూ తాగే నీళ్లు ఎలా తాగుతావంటూ ఉపాధ్యాయుడు ప్రశ్నించాడు. ఇంతటితో ఆగకుండా ఓ గదిలో బంధించి ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. దీంతో ఆ విద్యార్థి ముక్కులో నుంచి రక్తంకారింది. విషయం తెలిసిన తల్లి పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీయగా కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.