కాన్పూర్, నవంబర్ 26: రెండో ఎక్కం చెప్పలేదని తొమ్మిదేండ్ల విద్యార్థి చేతిపై ఓ ఉపాధ్యాయుడు పవర్ డ్రిల్ పెట్టడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా ప్రేమ్నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణం జరిగింది. బడి లైబ్రరీలో రిపేర్ పనులను పర్యవేక్షిస్తున్న ఉపాధ్యాయుడు గురువారం అటుగా వెళ్తున్న ఓ బాలుడిని పిలిచి రెండో ఎక్కం చదువాలన్నాడు. ఆ బాలుడు చదువలేకపోయాడు. కోపంతో హ్యాండ్ డ్రిల్ మిషన్ బాలుడి ఎడమచేతిపై పెట్టడంతో గాయాలయ్యాయి.
ఉపాధ్యాయులు బాలుడికి ప్రాథమిక చికిత్స అందించి ఇంటికి పంపించారు. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో శుక్రవారం పాఠశాల ఎదుట ధర్నా చేశారు. నిందితుడిని సస్పెండ్ చేసిన విద్యాశాఖ అధికారులు.. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ వేశారు. కమిటీ నివేదిక ప్రకారం టీచర్పై తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.