మల్లాపూర్, మార్చి 1: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 78 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. సిరిపూర్లో 26, మొగిలిపేటలో 2, కొత్తదాంరాజ్పల్లిలో 3, ముత్యంపేటలో 2 చొప్పున మొత్తం 33 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారి రాకేశ్కుమార్ గురువారం తెలిపారు. జాగ్రత్తలు పాటించాలన్నారు.
ధర్మపురి, ఏప్రిల్ 1: ధర్మపురి సీహెచ్సీలో గురువారం 51మందికి కొవిడ్ టీకా వేసినట్లు వైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ టీకా వేయించుకున్నారు.
రాయికల్, ఏప్రిల్ 1: రాయికల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గురువారం 70 మందికి టీకా వేసినట్లు వైద్యాధికారి కృష్ణ చైతన్య తెలిపారు. అలాగే 54 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చిందన్నారు.
కొడిమ్యాల, మార్చి 1: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 30 మందికి టీకా వేసినట్లు వైద్యుడు శ్రీనివాస్ తెలిపారు. 45 సంవత్సరాలు దాటిన వారు వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు.
మేడిపల్లి, ఏప్రిల్ 1: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45 సంవత్సరాల పైబడిన 26 మందికి కరోనా తొలి డోస్ వ్యాక్సిన్ను వేసినట్లు డాక్టర్ శివకుమారి తెలిపారు. ఆరోగ్య, వైద్య సిబ్బంది ఉన్నారు.
సారంగాపూర్, ఏప్రిల్ 1: మండలకేంద్రంలోని పీహెచ్సీలో 30 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇక్కడ బీర్పూర్ ఎంపీపీ మసర్తి రమేశ్, వైస్ ఎంపీపీ బల్మూరి లక్ష్మణ్ రావు, మండల వైద్యాధికారి రాణి మైత్రిరెడ్డి, సూపర్వైజర్ మోహన్ రెడ్డి, ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సారంగాపూర్, ఏప్రిల్ 1: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో గురువారం వైద్య సిబ్బంది ఎనిమిది మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ వచ్చినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
కథలాపూర్, ఏప్రిల్ 1: ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మొదటి రోజు 31 మంది టీకాలు వేసినట్లు వైద్యా ధికారి సౌజన్య తెలిపారు. సెలవు రోజుల్లో, ఆదివారం కూడా టీకాలు వేస్తామని ఆమె పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 1: పీహెచ్సీలో జడ్పీటీసీ కంఠం భారతి టీకా వేయించుకున్నారు. మ ండలంలోని 45 ఏళ్లు పైబడిన 35 మందికి టీకా వేసినట్లు మండల వైద్యాధికారి వనజ తెలిపారు. 40 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు వివరించారు. ఇక్కడ ఎంపీటీసీ తిమ్మని రాములు, ఆర్బీఎస్ గ్రామ అధ్యక్షుడు నేమూరి సత్యనారాయణ, ఫార్మసిస్ట్ ఉదయ్ ప్రసా ద్, సీహెచ్వో విజయభాస్కర్, సరోజ, జ్యోతి తోపాటు పలువురు పాల్గొన్నారు.
కోరుట్ల, ఏప్రిల్ 1: పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో 60 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్లు సూపరింటెండెంట్ నవీన్కుమార్ తెలిపారు.
ఇవి కూడా చుడండి
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
ఈ సమ్మర్లో షుగర్ పేషెంట్స్ ఇవి ట్రై చేయొచ్చు