ముంబై: టాటా ఇండస్ట్రీస్కు చెందిన టాటా క్లాస్ ఎడ్జ్ (టీసీఈ) సరికొత్త మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. ‘పడ్నే కా సహీ తరీఖా’ పేరుతో ను టాటా స్టడీ క్యాంపెయిన్ ను విడుదల చేసింది. 2021లో టాటా స్టడీని పాఠశాల అనంతర అభ్యాస యాప్గా పరిచయం చేసింది. దీనిని అభ్యాస శాస్త్ర మౌలిక సూత్రాల ఆధారంగా తీర్చిదిద్దారు. ఈ మల్టీ డిసిప్లీనరీ విధానంలో న్యూరో సైన్స్, సైకాలజీ, కాగ్నిటివ్ సైన్స్ నుంచి అధ్యయనాలను మిళితం చేశారు.
మొదటిసారిగా పరిచయం చేసిన టాటా స్టడీను విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు కూడా అమితంగా అభినందించారు. దీని డిజైన్, కంటెంట్, స్వీకరించతగిన స్టడీ ప్లానర్ కారణంగా వీరి ప్రశంసలను ఈయాప్ అందుకుంది. ఈ యాప్లోని స్టడీ ప్లానర్ విద్యార్థులకు అబ్యాసలక్ష్యాలను వెల్లడించడంతో పాటు తమకు తగినట్లుగా నేర్చుకునేలా తీర్చిదిద్దారు. ఈ తొలి విజయంతో టాటా స్టడీ ఇప్పుడు తమ సేవలను మార్కెటింగ్ ప్రచారం ద్వారా ప్రారంభించింది.
నూతన ప్రచారం “పడ్నే కా సహీ తరీఖా” ప్రధానంగా సరైన అభ్యాసంపై దృష్టిసారించింది. సరైన అభ్యాసం అంటే, ఒకరు తమ అభ్యాసాన్ని సమర్థవంతంగా ప్రణాళిక చేయడంతో పాటు, రివిజన్ ప్రాక్టీస్ అనుసరించేలా చేస్తుంది. ఈ ప్రచారాన్ని తల్లిదండ్రులు తమ పిల్లల విద్యకోసం ఏ విధమైన చర్యలను తీసుకుంటున్నారనే అంశాల ఆధారంగా ప్రారంభించారు. తమ చిన్నారుల విజయానికి భరోసా అందించేందుకు తల్లిదండ్రులు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అంతేకాదు పిల్లలపై కూడా ఒత్తిడి పెంచుతున్నారు. అసలైన విజయం అనేది సమర్థవంతమైన ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది తప్ప ఒత్తిడి చేయడం వల్ల కాదు.
ఈ ఆలోచనతోనే ‘ప్రెజర్ నహీ ప్లాన్’ అనే భావన పుట్టింది. వరుసగా పలు చిత్రాల ద్వారా చేసే ప్రచారంతో తమ అభ్యాసానికి సంబంధించి ప్రణాళిక ముఖ్యమని ప్రచారం చేస్తున్నారు. ప్రణాళికతో మాత్రమే చిన్నారులు అత్యుత్తమంగా సిద్ధంకావడంతో పాటు, ఒత్తిడి తగ్గించుకోవడం, తమ పరీక్షలలో చక్కటి ప్రతిభ కనబర్చగలరు.
ముల్లెన్ లింటాస్తో భాగస్వామ్యం గురించి టాటా క్లాస్ ఎడ్జ్ బీ2సీ చీఫ్ సచిన్ తోర్నీ మాట్లాడుతూ ‘‘అభ్యాస శాస్త్రపు మౌలిక సూత్రాలపై ఆధారపడి రూపొందించిన విద్యా ఉత్పత్తి టాటా స్టడీ. చిన్నారులు తమ అభ్యాసం ప్రణాళిక చేసుకోవడంతో పాటు, అర్థం చేసుకోవడం కోసం చదువాల్సిఉంటుంది. అటువంటప్పుడే, వారు తమ అభ్యాసాన్ని వాస్తవ జీవితంలో కూడా వినియోగించుకోగలరు.టాటా స్టడీకి బ్రాండ్ భాగస్వామిగా లింటాస్ను స్వాగతిస్తున్నాము’’ అని అన్నారు.