Today History: మన దేశంలో పరిశ్రమల స్థాపనకు ఆద్యుడిగా చెప్పుకుంటున్న జంషెడ్జీ టాటా.. 183 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున జన్మించారు. టాటా గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేన్స్.. ఉప్పు నుంచి మొదలుకొని ట్రక్కుల వరకు ప్రతిదీ తయారు చేస్తున్నాయి. అయితే, టాటా గ్రూపును ఈ స్థాయికి తీసుకురావడంలో జంషెడ్జీ టాటా ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన చూపిన దారిలో నడుస్తున్న తరువాతి తరం వారు టాటా స్థాపించిన పరిశ్రమలను దేశ సేవలో ముందుండేలా నిలుపుతున్నారని చెప్పడంలో ఎలాంటి ఔచిత్యం లేదు.
14 ఏండ్ల వయసులో తండ్రితో కలిసి ముంబైకి వలస వచ్చిన జెంషెడ్జీ.. 1839 మార్చి 3న దక్షిణ గుజరాత్లోని నవ్సారిలో పార్సీ కుటుంబంలో జన్మించాడు. ఈయన పూర్తి పేరు జంషెడ్జీ నౌసీర్వాన్జీ టాటా.
17 సంవత్సరాల వయస్సులో ముంబైలోని ఎల్ఫిన్స్టోన్ కాలేజీలో చేరి 1858 లో పట్టబద్రుడయ్యాడు. ఉక్కు కంపెనీని స్థాపించడం, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, ప్రత్యేకమైన హోటల్ను ఏర్పాటు చేయడం, జలవిద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం వంటివి ఈయన జీవితంలో ప్రధాన లక్ష్యాలు.
తన లక్ష్యాల్లోని కేవలం హోటల్ తాజ్ను మాత్రమే నిర్మించగలిగాడు. 1903లో ముంబైలో రూ.4.21 కోట్ల వ్యయంతో ఈ హోటల్ను నిర్మించారు. భారతదేశంలోనే ఎలక్ట్రిసిటీ కలిగి ఉన్న తొలి హోటల్ ఇది. తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చేందుకు జంషెడ్జీ కుమారుడు డోరబ్ టాటా.. 1907లో దేశంలోని మొట్టమొదటి ఉక్కు కంపెనీ.. టాటా స్టీల్ అండ్ ఐరన్ కంపెనీ (టిస్కో) ను స్థాపించారు. ఉద్యోగులకు పెన్షన్, గృహాలు, వైద్య సదుపాయాలు, అనేక ఇతర సౌకర్యాలను అందించి ఏకైక సంస్థగా నిలిచింది. జార్ఖండ్లోని జంషెడ్పూర్లో జంషెడ్జీ కలలు మన కళ్ల ముందు కదలాడుతాయి. టాటానగర్ అని పిలిచి ఈ నగరం ప్రణాళికాబద్ధంగా ఏర్పడింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వంటి సంస్థను స్థాపించాలని కలలు కన్న జంషెడ్జీ టాలా.. దీని కోసం ముంబైలోని 14 భవనాలు, నాలుగు ఆస్తులను విరాళంగా ఇచ్చాడు. మన దేశంలో పరిశ్రమల స్థాపనలో కీలకంగా వ్యవహరించిన జంషెడ్జీ టాటా 65 ఏండ్ల వయసులో 1904 మే 19 న కన్నుమూశారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
ప్రపంచ వినికిడి దినోత్సవం
ప్రపంచ వణ్యప్రాణి సంరక్షణ దినోత్సవం