చండీగఢ్: ప్రతిపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ మధ్య పంచాయితీ కొనసాగుతూనే ఉన్నది. తాజాగా పంజాబ్ ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా మాట్లాడుతూ ఆప్కు చెందిన 32 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్కు 18 మంది ఎమ్మెల్యేలు ఉండగా, టచ్లో ఉన్న 32 మందిని కలుపుకుంటే ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎంతసేపని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై పంజాబ్ సీఎం భగ్వంత్ మాన్ స్పందిస్తూ ‘ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారా? ఇదేనా కాంగ్రెస్ సిద్ధాంతం?’ అని మండిపడ్డారు.