బెంగళూరు: టెక్నాలజీ పరంగా ఎం తగా అభివృద్ధి చెందినా.. సమాజంలో కులవివక్ష ఇంకా బుసలు కొడుతూనే ఉన్నది. దేశంలో నిత్యం ఇటువంటి ఘటనలో ఎక్కడోచోట జరుగుతున్నా యి. తాజాగా కర్ణాటకలో దారుణమైన కులవివక్ష ఘటన చోటుచేసుకొన్నది. ఓ దళిత మహిళ ట్యాంకులో నీళ్లు తాగిందని.. చామరాజనగర్ జిల్లాలోని హెగ్గతోర గ్రామానికి చెందిన అగ్ర కులస్తులు ఆ ట్యాంకులోని నీటిని పారపోసి, అనంతరం గోమూత్రంతో ‘శుభ్రం’ చేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.