చెన్నై: తెలంగాణ, పుదుచ్చేరి మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్(Tamilisai Soundararajan).. ఇవాళ లోక్సభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసినట్లు ఆమె ఇవాళ తెలిపారు. ప్రధాని మోదీనే మళ్లీ పీఎం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు ఆమె చెప్పారు. సౌత్ చెన్నై నియోజకవర్గ ప్రజలు బాధ్యత కలిగిన వారని, ఒక మంచి పార్లమెంటేరియన్ కోసం జనం ఎదురుచూస్తున్నారని తమిళిసై తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎంపీ .. ప్రజలకు అందుబాటులో ఉండరని, నేను మీకు అందుబాటులో ఉంటానని, రాజ్యాంగబద్దమైన హోదాలో ఉన్నప్పుడు కూడా అందుబాటులో ఉన్నానని తెలిపారు. ప్రజలతో నేరుగా పనిచేయాలన్న ఉద్దేశంతోనే.. గవర్నర్ హోదాకు రాజీనామా చేసినట్లు తమిళిసై వెల్లడించారు. ఇటీవలే గవర్నర్ పదవికి రాజీనామా చేసి.. తమిళిసై బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
I have filed nomination for Chennai South Constituency as NDA alliance Candidate…
தென் சென்னை
பாராளுமன்ற தொகுதி தேசிய ஜனநாயக கூட்டணியின் வேட்பாளராக வேட்புமனு தாக்கல் செய்தபோது….#Tamilisai4southchennai #SouthChennai #BJP4IND #BJP4TN #Elections2024 @PMOIndia @narendramodi… pic.twitter.com/q7asVBOaRB— Dr Tamilisai Soundararajan (மோடியின் குடும்பம் ) (@DrTamilisaiGuv) March 25, 2024