చెన్నై: దీపావళి పండుగ నేపథ్యంలో షాపింగ్ కోసం జనం పోటెత్తారు. క్రాకర్స్ అవుట్లెట్స్, షాపింగ్ మాల్స్, స్వీట్ హౌస్లకు తాకిడి పెరిగింది. షాపింగ్ మాళ్లు, దుకాణాలు ఉన్న వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. దేశవ్యాప్తంగా అంతటా ఇదే పరిస్థితి ఉంది.
ప్రధాన నగరాల్లో అయితే జనం రద్దీ మరింత ఎక్కువగా ఉంది. హైదరాబాద్తోపాటు ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో జనం తాకిడికి దుకాణ సముదాయాలన్నీ కళకళలాడుతున్నాయి.
తమిళనాడు రాజధాని చెన్నైలోని టీ-నగర్ ఏరియాలోని వాణిజ్య ప్రాంతాల్లో అయితే జనం ఇసుకపోస్తే రాలనంతగా పోగయ్యారు. షాపింగ్ మాల్స్ మధ్య ఉన్న వీధుల్లో కూడా అడుగుతీసి అడుగుపెట్టే సందులేదు.