చెన్నై: కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గకపోవడంతో తమిళనాడు ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ పొడిగించింది. జూలై ఐదో తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. లాక్డౌన్ పొడిగింపుతోపాటే నిబంధనల్లో కొన్ని సడలింపులు కూడా చేసింది. ప్రార్థనా స్థలాలు, షాపింగ్ మాల్లు, జిమ్లను 50 శాతం కెపాసిటీతో పునఃప్రారంభించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అదేవిధంగా ఏ జిల్లా బస్సు సర్వీసులను అదే జిల్లాలో నడుపుకునేందుకు కూడా అనుమతిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.