చెన్నై, ఏప్రిల్ 24: క్రీడా మైదానాలతో పాటు పలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సర్వ్ చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. రాష్ట్రంలోని కాన్ఫరెన్స్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పెండ్లి మండపాలు, బ్యాంక్వెట్ హాల్స్, క్రీడా మైదానాలు, కుటుంబ ఫంక్షన్ల సమయంలో మద్యం సర్వ్ చేసేందుకుగానూ అనుమతులు ఇస్తూ స్టాలిన్ సర్కార్ ఒక ప్రత్యేకమైన లైసెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది.
కాగా, డీఎంకే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యకర్తలు తప్పుబట్టారు. ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయమని, నేరాల పెరుగుదలకు దారితీసే ప్రమాదం ఉన్నదని విమర్శించారు.