Tamil Nadu Farmer | తన ఆవును చంపాయన్న కారణంతో ఓ రైతు పులులపై ప్రతీకారం తీర్చుకున్నాడు. విషం పెట్టి ఆ పులులు చనిపోయేలా చేశాడు. అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో పడిఉన్న పులులను గుర్తించిన అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఓ రైతుపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది. పులులపై ప్రతీకారంతోనే విషం పెట్టినట్లు నేరం అంగీకరించాడు. ఈ ఘటన తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం నీలగిరి (Nilgiri) జిల్లాలో చోటు చేసుకుంది.
నీలగిరి అటవీ ప్రాంతంలో ఇటీవలే మూడు, ఎనిమిది ఏళ్ల వయసున్న రెండు పులులు (Tigers) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సమీపంలోనే మరో ఆవు కళేబరాన్ని (Dead Cow) కూడా గుర్తించారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు మూడు కళేబరాల శాంపుల్స్ను ఫోరెన్సిక్ టెస్ట్ కోసం కోయంబత్తూర్ పంపారు. అయితే, అందులో మూడు కళేబరాల్లో విషపూరిత ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఎమెరాల్డ్ గ్రామానికి చెందిన ఆవు యజమాని శేఖర్ను అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం బయటపడింది. పది రోజుల క్రితం తన ఆవును పులులు చంపాయని తెలిపాడు. వాటిపై ప్రతీకారం తీర్చుకునేందుకు సగం తిని వదిలేసిన ఆవు మృతదేహంపై పురుగుల మందు పూసినట్లు వివరించాడు.
Also Read..
Rajasthan | కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 25వ ఘటన
Libya Floods | ఎటుచూసినా శవాలే.. లిబియా జలప్రళయంలో 5,300 మంది మృతి