Virudhunagar | తమిళనాడు విరుదునగర్ జిల్లాలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో శనివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు వ్యక్తులు గాయపడ్డారు. వెంబకొట్టై సమీపంలోని రాము దేవన్పట్టిలోని ఫైర్క్రాకర్స్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకున్నది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది.
భవనం శిథిలాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మృతులు ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Explosion occurs in a firecracker manufacturing unit in Tamil Nadu’s Virudhunagar; details awaited pic.twitter.com/cALcg6A9Ow
— ANI (@ANI) February 17, 2024