ముంబై: కరోనా మహమ్మారి ఇన్వెస్టర్లకు చుక్కలు చూపుతున్నది. తాజాగా సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో మరో బ్లాక్ మండేగా రికార్డు నెలకొల్పింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 1469.32 పాయింట్లు నష్టపోయింది. తత్ఫలితంగా ఇన్వెస్టర్లు రూ.3.70 లక్షల కోట్ల సంపద కోల్పోయారు.
కరోనా రెండో వేవ్లో సోమవారం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. దీంతో వివిధ స్క్రిప్ట్లు అమ్మకాల ఒత్తిడికి గుయ్యాయి. తత్ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,70,729.4 కోట్లు హరించుకుపోయింది.
ఉదయం ట్రేడింగ్లో ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు భారీగానష్టపోయాయి. సోమవారం కొత్తగా 2,73,810 కరోనా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1.50 కోట్లు దాటింది. ఇప్పటికి యాక్టీవ్ కేసులు 19 లక్షలపైనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
కరోనా పాజిటివ్ కేసులు ఉద్ధృతంగా పెరుగుతుండటంతో రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. కఠిన ఆంక్షల దిశగా పయనిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూలు ప్రకటించాయి. వారాంతపు లాక్డౌన్లు విధించాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఆరు రోజుల లాక్డౌన్ విధించారు. మరోవైపు రోజురోజుకు కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆర్థిక రికవరీ మందగించే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు భావిస్తున్నాయి.
గత ఆర్థిక సంవత్సరంలో మాదిరే ప్రస్తుత (2021-22) ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలను బ్రోకరేజీ సంస్థలు తగ్గించాయి. స్థానికంగా విధిస్తున్న లాక్డౌన్ల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడి, రికవరీ నెమ్మదిస్తుందని అందుకే జీడీపీ వృద్ధి అంచనాల్ని తగ్గిస్తున్నామని తెలిపాయి.
ఇదిలా ఉంటే విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏప్రిల్లో రూ.4,615 కోట్లు వెనక్కి తరలి వెళ్లాయి.
ఇక వేగంగా వ్యాక్సిన్లు.. సీరమ్, భారత్ బయోటెక్లకు 4500 కోట్లు
ఇక పేటీఎం నుంచి ఎల్ఐసీ పాలసీ ప్రీమియం
ఆదాయ, వ్యయాలపై డేగ కన్ను
కరోనా నివారణకు 8 మార్గాలు
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మరో రికార్డు.. అదేంటంటే!
డోంట్ కేర్ కరోనా.. బంగారం దిగుమతి పైపైకి
బంగారం కొనేముందు కన్ఫూజన్ వద్దు!
డ్రాగన్ బ్యాంకులు.. భారత్ ఆంక్షలు.. సిటీ నిష్క్రమణ ఎందుకంటే!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..