చెన్నై, సెప్టెంబర్ 21: దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశం కల్పించే ‘నీట్’ (నేషనల్ ఎలిజిబిలిటీ, ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్షతో విద్యార్థులకు ఒనగూరే లబ్ధి ‘జీరో’ అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శించారు. నీట్ పీజీ-2023 మూడో రౌండ్ కౌన్సెలింగ్కు అర్హత మార్కుల శాతాన్ని జీరోగా (కటాఫ్ను) చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ‘కటాఫ్ను జీరోగా ప్రకటించటం ద్వారా నీట్ పరీక్ష అర్థంపర్థం లేనిదని కేంద్రమే అంగీకరించింది.
పరీక్ష ఫీజుల్ని వసూలు చేసి.. కోచింగ్ సెంటర్లకు లబ్ధి చేకూర్చారు. నిజమైన మెరిట్కు నీట్లో చోటులేదని మేం మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్నాం. కటాఫ్ను జీరోగా చేయటం ద్వారా పరీక్షను లాంఛనప్రాయం చేశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.