చెన్నై : అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు మోదీకి ఉన్నదా అని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గత 9 ఏండ్లలో బీజేపీ ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడిందో కాగ్ నివేదిక బట్టబయలు చేసిందని విమర్శించారు.
‘ప్రతి భారత పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షల చొప్పున వేస్తామన్నారు. వేశారా? రూ.15 వేలైనా వేశారా? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు.. సృష్టించారా? ఎంతమందికి ఉద్యోగాలిచ్చింది?’ అని ప్రశ్నించారు.