చెన్నై: బీజేపీ సర్కారు విద్వేషవ్యాప్తిలో బిజీగా ఉన్నదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో అధికార బీజేపీ ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్ కోటాను రద్దుచేసి, వీరశైవ లింగాయత్లు, వొక్కలిగలకు కేటాయించిందని మండిపడ్డారు. మైనార్టీల పట్ల బీజేపీకి ఉన్న ద్వేషానికి ఇదే నిదర్శనమన్నారు. చెన్నైలో బుధవారం ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ రద్దు నిర్ణయాన్ని అమిత్షా సమర్థించుకోవడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనన్నారు. విద్వేషపూరిత ఎజెండాను బీజేపీ అమలు చేస్తున్నదని చెప్పారు.