సాలెం, మే 24: కేంద్ర ంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. ఆర్థిక అంశాలు, పన్ను విధింపునకు సంబంధించి రాష్ర్టాలకు ఉన్న హక్కులను హరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలపై ఒక విధమైన ఆర్థిక సంక్షోభాన్ని మోపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను ఆదుకోనివ్వకుండా అడ్డుకుంటున్నదన్నారు. కేంద్రం నుంచి ఇంకా రూ.21,761 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నదని పేర్కొన్నారు. భారీయెత్తున పెట్రో ధరలను పెంచిన మోదీ సర్కార్.. ఇప్పుడు స్వల్పంగా తగ్గించి గొప్పలు చెప్పుకుంటున్నదని, బీజేపీ గద్దెనెక్కిన 2014 నుంచి పెంచిన మొత్తం సుంకాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.