MK Stalin | తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) లోక్సభ ఎన్నికల (Lok Sabha Polls) ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో తిరుగుతూ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానికులు, అక్కడి దుకాణదారులను ఓట్లు అడుగుతున్నారు. డీఎంకే అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు.
మంగళవారం ఉదయం తూత్తుకుడి (Thoothukudi) జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన సోదరి, డీఎంకే ఎంపీ కనిమొళి (Kanimozhi)తో కలిసి తూత్తుకుడిలోని కూరగాయల మార్కెట్, మత్స్యకారుల కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంకే అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ మద్దతుదారుడి నివాసంలో సీఎం టీ కూడా తాగారు. ఈ సందర్భంగా స్థానికులు సీఎంతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.
#WATCH | Tamil Nadu Chief Minister and DMK President MK Stalin with party leader Kanimozhi visit the fishermen colony in Thoothukudi. The CM also had tea at the residence of the party supporter
(Video source: DMK) pic.twitter.com/HvOyPYT9BK
— ANI (@ANI) March 26, 2024
#WATCH | Tamil Nadu Chief Minister and DMK President MK Stalin with party leader Kanimozhi campaigns in the vegetable market in Thoothukudi, ahead of Lok Sabha elections
(Video source: DMK) pic.twitter.com/FlxZD0Q0I8
— ANI (@ANI) March 26, 2024
Also Read..
Jaggi Vasudev | ఆసుపత్రి బెడ్పై పేపర్ చదువుతూ.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన సద్గురు
Islamabad | పాక్ రెండో అతిపెద్ద నేవీ ఎయిర్స్టేషన్పై ఉగ్రదాడి.. వారం వ్యవధిలోనే రెండో అటాక్
Vladimir Putin: ఇస్లామిక్ తీవ్రవాదులే ఆ ఉగ్ర దాడికి పాల్పడ్డారు: పుతిన్