Islamabad | పొరుగు దేశం పాకిస్థాన్లో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. పాక్లోని (Pakistan) రెండో అతిపెద్ద నేవీ ఎయిర్స్టేషన్ (second largest naval air station) పీఎన్ఎస్ సిద్ధిఖ్ (PNS Siddique)పై సోమవారం రాత్రి దాడి చేశారు. పలువురు తిరుగుబాటుదారులు తుపాకులు, బాంబులతో నావల్ ఎయిర్స్టేషన్ స్థావరంపై (Terrorists Attack) విరుచుకుపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సైనికులు, పోలీసులు ఎదురుకాల్పులు జరిపి నలుగురు తీవ్రవాదులను హతమార్చారు (Terrorists). ఎయిర్స్టేషన్కు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. బాలూచిస్థాన్లో ఉన్న ఈ స్థావరంలో చైనాకు చెందిన డ్రోన్లను పెద్ద ఎత్తున మోహరించినట్లు సమాచారం.
మరోవైపు ఈ ఘటనకు నిషేధిత ‘బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (Balochistan Liberation Army)’ బాధ్యత వహించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తమ కాల్పుల్లో డజనుకు పైగా పాకిస్థానీ బలగాలు మృతి చెందినట్లు తెలిపింది. అయితే పాకిస్థాన్ సైన్యం మాత్రం దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. వారం రోజుల వ్యవధిలోనే ఈ ముఠా ఈ తరహా దాడికి యత్నించడం ఇది రెండోసారి. మార్చి 20న గ్వాదర్ పోర్టుపైనా ముష్కరులు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో భద్రతా బలగాలు ఏడుగురిని హతమార్చాయి.
Also Read..
Jaggi Vasudev | ఆసుపత్రి బెడ్పై పేపర్ చదువుతూ.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన సద్గురు
Prakash Raj | విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్.. ప్రకాశ్రాజ్కు బర్త్ డే విషెస్
Vladimir Putin: ఇస్లామిక్ తీవ్రవాదులే ఆ ఉగ్ర దాడికి పాల్పడ్డారు: పుతిన్