మదురై, డిసెంబర్ 2: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారి అంకిత్ తివారీ లంచం కేసులో తమిళనాడు డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్(డీవీఏసీ) అధికారులు శనివారం మదురైలోని ఈడీ సబ్ జోనల్ కార్యాలయంలో దాదాపు 13 గంటలపాటు సోదాలు చేపట్టారు. అంకిత్ వివారీ నివాసంలో కూడా తనిఖీలు చేపట్టినట్టు సంబంధిత అధికారిక వర్గాలు వెల్లడించాయి.
లంచం నేరారోపణలకు సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకొన్నట్టు తెలిపాయి. ఆదాయానికి మంచిన ఆస్తుల కేసులో అంకిత్ తివారీ శుక్రవారం ఓ వైద్యుడి నుంచి రూ.20 లక్షలు లంచం తీసుకొంటుండగా డీవీఏసీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకొన్న విషయం తెలిసిందే.