న్యూఢిల్లీ: 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్పథ్లో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఈ వేడుకల్లో త్రివిధ దళాల మార్చ్ ఫాస్ట్, విన్యాసాలు, శకటాల ప్రదర్శన, వివిధ రాష్ట్రాలు, కేంత్రమంత్రిత్వ శాఖల శకటాల ప్రదర్శన ఆహుతులను అకట్టుకున్నాయి. రాష్ట్రాల శకటాలు పరేడ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మేఘాలయ రాష్ట్రాలనికి చెందిన శకటంపై మహిళలు వెదురు బుట్టలు అల్లుతున్నట్లుగా ఉన్న నమూనా ప్రత్యేకతను సంతరించుకున్నది. గుజరాత్ శకటం ప్రధానంగా అక్కడి గిరిజనుల పోరాటపటిమను చాటిచెప్పింది. ఉత్తరాఖండ్ శకటంలో హేమకుంద్ సాహిబ్, బద్రీనాథ్ నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. గోవా శకటాన్ని అక్కడి వారసత్వ చరిత్రను చాటిచెప్పేలా డిజైన్ చేశారు.
అదేవిధంగా కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, జమ్ము అండ్ కశ్మీర్ శకటాలు కూడా 73వ రిపబ్లిక్ డే పరేడ్లో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాయి. టోక్యో ఒలింపిక్స్లో మొత్తం 7 పతకాలు రాగా, అందులో నాలుగు పతకాలు హర్యానా ఆటగాళ్లకే దక్కడం ఆ రాష్ట్రం శకటంపై క్రీడాకారుల నమూనా అకట్టుకున్నది. యూపీ శకటంపై స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి కల్పనకు సంబంధించిన నమూనాలను ప్రదర్శించారు.